నేడు మూడు మెట్రో స్టేషన్ల పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-12-03T08:01:38+05:30 IST

కరోనా మహమ్మారి వల్ల 8 నెలలుగా మూతబడిన మెట్రో స్టేషన్లు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ తీవ్రత తక్కువగా ఉన్న

నేడు మూడు మెట్రో స్టేషన్ల పునఃప్రారంభం

భరత్‌నగర్‌,ముషీరాబాద్‌, గాంధీ హాస్పిటల్‌లో రైళ్లు షురూ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల 8 నెలలుగా మూతబడిన మెట్రో స్టేషన్లు పునఃప్రారంభం కానున్నాయి. కొవిడ్‌ తీవ్రత తక్కువగా ఉన్న స్టేషన్లను 2నెలల క్రితం ప్రారంభించి మెట్రో రైళ్లు నడిపిస్తున్న అధికారులు గురువారం నుంచి భరత్‌నగర్‌, ముషీరాబాద్‌, గాంధీ ఆస్పత్రిలోనూ ప్రారంభిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.


సాధారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే రైళ్లను ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరున్నరకే ప్రారంభిస్తున్నారు. ఆయా కారిడార్ల నుంచి రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభమయ్యే చివరి రైలు 10.30కు టెర్మినల్‌ స్టేషన్‌కు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌-రాయదుర్గం, జేబీఎ్‌స-ఎంజీబీఎస్‌ మార్గాల్లో గతంలో రోజూ 4 లక్షల మందికి పైగా ప్రయాణించేవారు.

కొవిడ్‌ కారణంగా ప్రయాణికుల సంఖ్య 1.80-2 లక్షలకు తగ్గింది. దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు మెట్రో అధికారులు ఆఫర్లను ప్రతిపాదించారు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు మాస్కులు ధరించి కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Updated Date - 2020-12-03T08:01:38+05:30 IST