సీఎ్సఐ క్యాంబెల్ హాస్పిటల్ పున: ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-03T05:22:45+05:30 IST
సీఎ్సఐ క్యాంబెల్ హాస్పిటల్ సింహాద్రిపురంలో దశాబ్ద కాలం తర్వాత పున: ప్రారంభించారు.
సింహాద్రిపురం, జూలై 2: సీఎ్సఐ క్యాంబెల్ హాస్పిటల్ సింహాద్రిపురంలో దశాబ్ద కాలం తర్వాత పున: ప్రారంభించారు. సీఎ్సఐ రాయలసీమ డయాసిస్ బిషఫ్ ఐజెక్ వరప్రసాద్ చేతులు మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అగస్టీన మాట్లాడుతూ ఈ హాస్పిటల్కు ప్రతి రోజు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ జమ్మలమడుగు నుంచి వచ్చిరోగులను పరీక్షించే విదంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ క్రింద అన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారని అగస్టీన వివరించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియాకు చెందిన రెవరెండ్ లీదయా ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. పులివెందుల చర్చి ఫాస్టర్ ఆనంద్బాబు, వైఎస్ మధు, సెక్రటరీ జీఐసీ ఖేల్కర్, హెచఎమ్ సురేష్ పాల్గొన్నారు.