ఆధార్ కేంద్రాన్ని వెంటనే పునరుద్ధరించాలి
ABN , First Publish Date - 2021-06-14T05:49:43+05:30 IST
మండల కేంద్రం చినగం జాంలోని ఆధార్ కేంద్రాన్ని వెంటనే పునరుద్ధరించా లని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ గున్నమ నేని ప్రతాప్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం ధ ర్నా నిర్వహించారు.
చినగంజాం, జూన్ 13: మండల కేంద్రం చినగం జాంలోని ఆధార్ కేంద్రాన్ని వెంటనే పునరుద్ధరించా లని సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ గున్నమ నేని ప్రతాప్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం ధ ర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రతాప్కుమార్ మాట్లాడుతూ ప్రతి పథకానికి ఆధార్ లింకు అడు గుతున్న ప్రభుత్వం ఆధార్ కేంద్రం విషయంలో ని మ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం మంచిది కాదని అన్నారు. ఉన్నాతాధికారులు కలుగజేసుకుని ఆధార్ కేంద్నాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. లేని ప క్షంలో ఈ నెలఖారులో మండల పరిధిలోని ప్రజ లందరని సమీకరించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు జి.యాకోబు, కె.జెస్సీ, కె.సునీల్, సురే ష్, శ్రీను, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.