ఇల్లు ఖాళీ చేయమంటే చంపేస్తానని బెదిరింపు
ABN , First Publish Date - 2021-03-02T14:30:35+05:30 IST
ఏడేళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్నాడు. అద్దె చెల్లించమంటే చంపేస్తానని...
- పోలీసులకు బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్/అడ్డగుట్ట : ఏడేళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్నాడు. అద్దె చెల్లించమంటే చంపేస్తానని వృద్ధ దంపతులను బెదిరిస్తున్నాడు ఓ వ్యక్తి. తుకారాంగేట్ సాయినగర్కు చెందిన చంద్రకళ, ఎన్ఎల్ రవిశంకర్ భార్యాభర్తలు. వీరి ఇంట్లో సాయి గణేష్ అనే వ్యక్తి ఏడేళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. లాక్డౌన్ కాలం నుంచి అతడు అద్దె ఇవ్వకపోవడంతో ఇల్లు ఖాళీచేయమని వృద్ధ దంపతులు అతడికి చెప్పారు. వీరికి కొడుకులు, కుమార్తెలు లేకపోవడంతో ఎలాగైనా ఆ ఇల్లు సొంతం చేసుకోవాలనుకున్నాడు. సాయిగణేష్ వృద్ధ దంపతులను చంపేస్తానని బెదిరించడంతో బాధితులు తుకారాంగేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయిగణేష్ బెదిరింపులు భరించలేక భయంతో నేరేడ్మెట్లో అద్దెకు ఉంటున్నామని బాధితులు తెలిపారు.