రెండు కార్లు ఢీ : యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-05-27T03:09:01+05:30 IST
రెండు కార్లు ఒకదాని వెనుక మరొక టి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన గుడ్లూరు మండలంలోని
మరో ఇద్దరికి గాయాలు
గుడ్లూరు, మే 26 : రెండు కార్లు ఒకదాని వెనుక మరొక టి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన గుడ్లూరు మండలంలోని మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు, నెల్లూరు నగరంలోని బీవీనగర్కు చెందిన సందీప్(24) మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గురువారం నెల్లూరు నుంచి ఒంగోలులో జరుగుతున్న ఒక కార్యక్రమా నికి వెళ్లి తిరిగి నెల్లూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో మోచర్ల దగ్గరకు రాగానే ముందుపోతున్న కారును అధికమిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక కారును డ్రైవ్ చేస్తున్న సందీప్కు తీవ్రగాయాలు కాగా, వెనుక సీటులో కూర్చొని ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనను గమనించిన హైవే మొబైల్ పోలీసులు స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన సందీప్ను కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.