ట్రాఫిక్ ఐల్యాండ్ను తొలగించడం అన్యాయం
ABN , First Publish Date - 2022-07-04T05:23:52+05:30 IST
సీఎం వైఎస్ జగనమోహనరెడ్డి పర్యటన పేరుతో వేంపల్లె నాలుగురోడ్ల కూడలిలోని ట్రాఫిక్ ఐ ల్యాండ్ను తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మై నార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్ షబ్బీర్ పేర్కొన్నారు.
వేంపల్లె, జూలై 3: సీఎం వైఎస్ జగనమోహనరెడ్డి పర్యటన పేరుతో వేంపల్లె నాలుగురోడ్ల కూడలిలోని ట్రాఫిక్ ఐ ల్యాండ్ను తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మై నార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్ షబ్బీర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లె నాలుగురోడ్ల కూడలిలో ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ ఐల్యాండ్ ఉండేదన్నారు. ప్రస్తుతం సీఎం పర్యటన పేరు లేదా రోడ్ల వస్తరణ అభివృద్ధి పేరుతో తొలగించినప్పటికి ఆ స్థానంలో గాంధీ విగ్రహం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన బాలస్వామిరెడ్డి, టీడీపీ రైతు విభాగ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్నాథరెడ్డి, జిల్లా కార్యదర్శి పివి రమణ, దేవస్థాన మాజీ సభ్యులు తిప్పారెడ్డి, రామకృష్ణారెడ్డి, పాపిరెడ్డి, మహబూబ్ షరీఫ్ పాల్గొన్నారు.