రెడ్‌క్రాస్‌ కమిటీ నుంచి అంకయ్య చౌదరి తొలగింపు

ABN , First Publish Date - 2020-11-29T05:19:11+05:30 IST

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ కమిటీ నుంచి జిల్లా కమిటీ సభ్యుడు మక్కెన అంకయ్య చౌదరిని రాష్ట్ర కమిటీ తొలగించింది.

రెడ్‌క్రాస్‌ కమిటీ నుంచి అంకయ్య చౌదరి తొలగింపు

 నెల్లూరు (వైద్యం)నవంబరు 28 : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ కమిటీ నుంచి జిల్లా కమిటీ సభ్యుడు మక్కెన అంకయ్య చౌదరిని రాష్ట్ర కమిటీ తొలగించింది. రెడ్‌క్రాస్‌ ప్రాఽథమిక సభ్యత్వం నుంచి కూడా  తొలగించింది. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ జనరల్‌ సెక్రటరీ, ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అశ్విన్‌కుమార్‌ ఈనెల 24వ తేదీన ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రెడ్‌క్రాస్‌ జిల్లా మేనేజర్‌ మస్తానయ్య శనివారం ఆ ఉత్తర్వులను విడుదల చేశారు.  అంకయ్యచౌదరి రెడ్‌క్రాస్‌ నిబంధలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఇటీవల జిల్లా కమిటీ నేతలు భావించారు. ఇటీవల ప్లాస్మా పంపిణీలో రెడ్‌క్రాస్‌లో అవకవతకలు జరిగాయని వచ్చిన ఆరోపణలో అంకయ్య చౌదరి మీడియాను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కలెక్టర్‌ చక్రధర్‌బాబు, రెడ్‌క్రాస్‌ రాష్ట్రశాఖ వేసిన కమిటీల విచారణలో రెడ్‌క్రా్‌సలో ప్లాస్మా అక్రమాలు జరగలేదని వెల్లడైంది. ఈ నేపఽథ్యంలో అంకయ్య చౌదరిని రాష్ట్ర కమిటీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ అంశం రెడ్‌క్రాస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Updated Date - 2020-11-29T05:19:11+05:30 IST