రోడ్డు విస్తరణ పేరుతో బలిపీఠం తొలగిస్తారా ?

ABN , First Publish Date - 2021-01-19T07:18:49+05:30 IST

కదిరి పట్టణంలో రోడ్డు విస్తరణ పేరుతో లక్ష్మీనరసింహస్వామి బలిపీఠంలో ఒక్క టైన పడమర దిక్కున ఉన్న బలిపీఠం తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేయడం దారుణమని బీజేపీ నాయకులు మండిపడ్డారు.

రోడ్డు విస్తరణ పేరుతో బలిపీఠం తొలగిస్తారా ?
హిందూపురంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న బీజేపీ నాయకులు

హిందూపురం టౌన్‌, జనవరి 18 : కదిరి పట్టణంలో రోడ్డు విస్తరణ పేరుతో లక్ష్మీనరసింహస్వామి బలిపీఠంలో ఒక్క టైన పడమర దిక్కున ఉన్న బలిపీఠం తొలగించేందుకు అధికారులు ప్రయత్నం చేయడం దారుణమని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ పార ్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, ఇతర నాయకులు తహసీల్దార్‌ శ్రీనివాసులుకు వినతిపత్రం అందించారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమేష్‌రెడ్డి, వరప్రసాద్‌, టీకె బాబు, ఆదర్శ్‌, దివాకర్‌, శంకర్‌, మడకశిర చంద్రశేఖర్‌, వెంకటరామిరెడ్డి, నగేష్‌బాబు, రవితేజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


 ఈఓపై చర్యలు తీసుకోండి 

పెనుకొండ : కదిరి లక్ష్మీనర సింహ స్వా మి ఆలయం బలిపీఠాన్ని తొలగిం చడా నికి ప్రయత్నించిన ఆలయ ఈఓపై చర్య లు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయ కులు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. సోమవారం బీజేపీ నాయకులు రామాంజనేయులు, రామక్రి ష్ణ, సుబాష్‌చంద్రబోస్‌, రవి, హనుమంతు, గాయిత్రి, కేదరినాథ్‌, అంబోజిరావు, కార్యక ర్తలు సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందిం చారు. ఆలయాలపై దాడులను బీజేపీ ఖండిస్తోందన్నారు. 


Updated Date - 2021-01-19T07:18:49+05:30 IST