CM Jagan నివాసం సమీపంలో భారతమాత విగ్రహం తొలగింపు.. ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-08-24T13:17:39+05:30 IST

తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలో ఉన్న

CM Jagan నివాసం సమీపంలో భారతమాత విగ్రహం తొలగింపు.. ఉద్రిక్తత

గుంటూరు : తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలో ఉన్న ‘భారతమాత’ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. సోమవారం అర్ధరాత్రి క్రేన్ సాయంతో ఈ విగ్రహాన్ని తొలగించడం జరిగింది. సీఎం ఇంటికి భద్రత పేరుతో విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విగ్రహం తాడేపల్లికి ప్రధాన ఆకర్షణగా ఉండేది. భారతమాత విగ్రహం తొలగింపుతో తాడేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా విగ్రహాన్ని తొలగించారని కూడా వార్తలు వస్తున్నాయి. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Updated Date - 2021-08-24T13:17:39+05:30 IST