ఖమ్మం ధర్మాస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ దందా

ABN , First Publish Date - 2021-05-06T08:02:28+05:30 IST

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల అక్రమ అమ్మకాల గుట్టు రట్టయ్యింది.

ఖమ్మం ధర్మాస్పత్రిలో రెమ్‌డెసివిర్‌ దందా

ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.38వేలకు విక్రయించే యత్నం

వలపన్ని ముగ్గురు సిబ్బందిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌


ఖమ్మం సంక్షేమ విభాగం, మే 5 : ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల అక్రమ అమ్మకాల గుట్టు రట్టయ్యింది. పక్కా సమాచారం అందడంతో ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రామానుజం, సీఐ వేణుమాధవ్‌, ఎస్‌ఐ సతీ్‌షలు వలపన్ని.. ఓ స్టాఫ్‌నర్స్‌, మరో ఇద్దరు పేషంట్‌ కేర్‌ సిబ్బంది ఆస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు బయటకు తెచ్చి కరోనా రోగుల బంధువులకు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న ఆరు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొని నిందితులను ఖమ్మం రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.38వేలకు విక్రయించే ప్రయత్నం చేస్తున్న ముగ్గురు ఆస్పత్రి సిబ్బందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నట్లు ఖమ్మం రెండో పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-06T08:02:28+05:30 IST