స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

ABN , First Publish Date - 2022-08-20T05:22:10+05:30 IST

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను నిరంతం స్మరించుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి
కేసీఆర్‌ కిట్లు అందజేస్తున్న మంత్రి ఈశ్వర్‌

 - మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి టౌన్‌, ఆగస్టు 19 : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను నిరంతం స్మరించుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. వజ్రో త్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రభు త్వాస్పత్రిలో నిర్వహించిన కార్యక్ర మానికి హాజరై మాట్లాడారు. ప్రభు త్వాస్పత్రుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రసవాల సంఖ్య పెరిగింద న్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల దీటుగా సేవలందించడం వల్లే గర్భిణుల్లో న మ్మకం పెరిగిందన్నారు. అత్యవసర మైతేనే సీజేరియన్లు చేస్తున్నారని లే దంటే సాధారణ ప్రసవానికే అవకాశం ఎక్కువగా కల్పిస్తు న్నారని వివరించారు. ఎందరో సమరయోధుల విరోచిత పో రాటం వల్ల స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అంతకుముందు రోగులకు పండ్లు, బాలింతలకు కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశా రు. మతాశిశు సంక్షేమ ఆస్పత్రిని పరిశీలించి సేవల పట్ల అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ, జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, ఎమ్మెల్యే దా సరి మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, రఘు వీర్‌సింగ్‌, జిల్లా వైద్య అధికారి ప్రమోద్‌కుమార్‌, వాసుదేవా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T05:22:10+05:30 IST