బ్లాక్లో రెమిడిసివర్ ఇంజెక్షన్లు... ఇద్దరి అరెస్ట్
ABN , First Publish Date - 2021-05-12T17:04:56+05:30 IST
బ్లాక్లో అధిక ధరలకు రెమిడిసివర్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి
హైదరాబాద్/బౌద్ధనగర్: బ్లాక్లో అధిక ధరలకు రెమిడిసివర్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం రాత్రి మైలార్గడ్డలో ఇద్దరు వ్యక్తులు రెమిడిసివర్ ఇంజెక్షన్లు బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారని చిలకలగూడ పోలీసులకు, డ్రగ్ ఇన్స్పెక్టర్ డి.శ్వేతబిందుకు విశ్వసనీయ సమాచారం అందింది. డ్రగ్ ఇన్స్పెక్టర్, పోలీసులు కలిసి మైలార్గడ్డ శ్రీరాఘవేంద్ర టిఫిన్ సెంటర్ వద్ద కాపు కాచారు. పోలీసులను చూసి నిందితులు జి.రాఘవేందర్ (44), ఎం.మధుసూదన్(39) తప్పించుకోవటానికి ప్రయత్నించగా వారిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఐదు డోసుల కోవిఫర్(రెమిడిసివర్) ఇంజెక్షన్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క డోసు రూ.30 వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.