ట్రాక్టర్‌ను దొంగిలించిన వ్యక్తికి రిమాండ్‌

ABN , First Publish Date - 2022-05-23T05:04:34+05:30 IST

ట్రాక్టర్‌ను దొంగిలించిన వ్యక్తిని ఆదివారం సదాశివపేట పోలీసులు అరెస్టు చేశారు.

ట్రాక్టర్‌ను దొంగిలించిన వ్యక్తికి రిమాండ్‌
















సదాశివపేట, మే 22 : ట్రాక్టర్‌ను దొంగిలించిన వ్యక్తిని ఆదివారం సదాశివపేట పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గూడూరి సంతో్‌షకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం...  సదాశివపేట పట్టణంలోని హరిజనవాడకు చెందిన అలంపల్లి సాంబయ్య(50) తన ట్రాక్టర్‌ను రోజూ మాదిరిగానే ఇంటి ఎదురుగా పార్కింగ్‌ చేశాడు. శనివారం రాత్రి పార్కింగ్‌ చేసిన ట్రాక్టర్‌ ఉదయం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఆదివారం మధ్యాహ్నం మండలంలోని పెద్దాపూర్‌ గ్రామం వద్ద సీఐ గుడూరు సంతో్‌షకుమార్‌ తన సిబ్బందితో వాహనాలను తనికీ చేస్తున్నాడు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా పెద్దాపూర్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌, ట్రాక్టర్‌ నడుపుతున్న మునిపల్లికి చెందిన మహమ్మద్‌ షానవాజ్‌ను పట్టుకున్నారు. విచారించగా సదాశివపేటలో ట్రాక్టర్‌ను దొంగిలించినట్టు, హైదరాబాద్‌లో అమ్మడానికి తీసుకెళ్తున్నట్టు అంగీకరించాడు. పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, నిందితుడు మహమ్మద్‌ షానవాజ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. 

Updated Date - 2022-05-23T05:04:34+05:30 IST