గంజాయి విక్రేతలకు రిమాండ్‌

ABN , First Publish Date - 2020-10-02T08:13:26+05:30 IST

గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్‌తోపాటు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు

గంజాయి విక్రేతలకు రిమాండ్‌

బంజారాహిల్స్‌, అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న రౌడీషీటర్‌తోపాటు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 900 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌కు చెందిన గువ్వల పవన్‌కుమార్‌ అలియాస్‌ బిల్లా పవన్‌ సంజీవరెడ్డినగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌.


యూసు్‌ఫగూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన వినయ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. వినయ్‌ బెంగళూరులోని ఎస్‌జేఈఎస్‌ కాలేజీ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ సందర్భంగా నగరంలోనే ఉన్న విన య్‌ డబ్బుకోసం బిల్లా పవన్‌తో కలిసి గంజాయి అమ్మ డం మొదలు పెట్టాడు. ఇద్దరు గంజాయి విక్రయిస్తుండగా జూబ్లీహిల్స్‌ పోలీసులు పట్టుకున్నారు. బిల్లా పవన్‌ నుంచి 500 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌, వినయ్‌కుమార్‌ నుంచి 400 గ్రాముల గంజాయి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-10-02T08:13:26+05:30 IST