మతపెద్దలు, హోటళ్ల నిర్వాహకులతో భేటీ

ABN , First Publish Date - 2020-06-07T07:30:07+05:30 IST

సోమవారం నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్థనాలయాలు

మతపెద్దలు, హోటళ్ల నిర్వాహకులతో భేటీ

గుంటూరు, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): సోమవారం నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రార్థనాలయాలు తెరుచుకోనుండటంతో మతపెద్దలతో జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, అర్బన్‌ ఎస్‌పీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్‌ ఎస్‌పీ సీహెచ్‌ విజయారావు శనివారం భేటీ అయ్యారు. లాక్‌డౌన్‌ నిబంధనలను తూచ తప్పకుండా పాటించేలా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. 


నేడు హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ పునఃప్రారంభం

బొంతపాడులో హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ని ఆదివారం సాయంత్రం నుంచి పునఃప్రారంభించనున్నట్లు మార్కెట్‌లోని వర్తకులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో మార్కెట్‌కు చెందిన 22 మందికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. దాంతో మార్కెట్‌ని మూసేశారు. ప్రజలు కూరగాయలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు షాపుల మధ్యన 40 అడుగుల దూరం పాటిస్తూ ఆదివారం సాయంత్రం నుంచి తిరిగి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నామని వర్తకులు తెలిపారు. 

Updated Date - 2020-06-07T07:30:07+05:30 IST