కాబుల్ నుంచి భారత్ వచ్చిన మహిళ ఏమన్నారంటే...
ABN , First Publish Date - 2021-08-23T12:33:00+05:30 IST
ముఖంలో చిరునవ్వుతో ఏడాది పిల్లాడిని ఎత్తుకుని...
న్యూఢిల్లీ: ముఖంలో చిరునవ్వుతో ఏడాది పిల్లాడిని ఎత్తుకుని తన కుటుంబ సభ్యులతో సహా ఒక మహిళ భారత్ చేరుకున్నారు. కాబుల్లో విమానం ఎక్కడానికి ముందు ఆమె ఎంతో ఆందోళనకు లోనయ్యారు. ఆమె వీలైనంత త్వరగా అఫ్ఘాన్ నుంచి బయటపడి, కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని తపనపడ్డారు. ఎట్టకేలకు ఆమె ఆశ నెరవేరింది. ఆమె ఎక్కిన విమానం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో గల హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్నంతనే ఆమె ముఖంలో పట్టలేనంత ఆనందం కనిపించింది.
ఇది కాబుల్ నుంచి ఇండియాకు సురక్షితంగా చేరుకున్న ఒక మహిళ కథ. కాబుల్ నుంచి ఇక్కడికి వచ్చివారందరిలో ఇటువంటి భావోద్వేగమే వ్యక్తం అయ్యింది. ఇప్పటివరకూ వారిని అలముకున్న దిగులుపోయి, కొత్త ఉత్సాహం, జీవితంపై భరోసా కనిపించాయి. కాబుల్ నుంచి భారత్ చేరుకున్న రంజీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ తాను భారత్ చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు.