రిలయెన్స్ ఉద్యోగుల కుటుంబాలకు నీతా అంబానీ శుభవార్త

ABN , First Publish Date - 2021-03-05T12:49:22+05:30 IST

దేశంలోని రిలయెన్స్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీ శుభవార్త వెల్లడించారు....

రిలయెన్స్ ఉద్యోగుల కుటుంబాలకు నీతా అంబానీ శుభవార్త

ముంబై (మహారాష్ట్ర): దేశంలోని రిలయెన్స్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీ శుభవార్త వెల్లడించారు. దేశంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద రిలయెన్స్ ఉద్యోగులు, వారి భార్యా పిల్లలు, తల్లిదండ్రులు వారి పేర్లను నమోదు చేసుకోవాలని నీతాఅంబానీ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సందేశంలో కోరారు. కరోనా టీకాలకు అయ్యే వ్యయాన్ని తమ రిలయెన్స్ కంపెనీ భరిస్తుందని నీతాఅంబానీ తెలిపారు.రిలయెన్స్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని అందుకే కరోనా టీకాలు వేసుకోవడంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కరోనా మార్గదర్శకాలను పాటించాలని నీతాఅంబానీ సూచించారు.గతంలో 2020 రిలయెన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా అదరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని రిలయెన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, నీతాఅంబానీలు ప్రకటించారు.‘కరోనా హారేగా, ఇండియా జీతేగా’ అనే నినాదంతో కేంద్రప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. 

Updated Date - 2021-03-05T12:49:22+05:30 IST