రిలయన్స్-ఫ్యూచర్ డీల్ నేడో రేపో!?
ABN , First Publish Date - 2020-08-05T06:30:17+05:30 IST
కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల్లో మెజారిటీ వాటా కొనుగోలుపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అతి త్వరలో ప్రకటన చేసే అవకాశం కన్పిస్తోంది
ముంబై: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల్లో మెజారిటీ వాటా కొనుగోలుపై రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అతి త్వరలో ప్రకటన చేసే అవకాశం కన్పిస్తోంది. ఈ డీల్కు సంబంధించి ఇరువర్గాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయి. నేడో రేపో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ ఒప్పం దం విలువ రూ.22 వేల కోట్ల పైస్థాయిలో ఉండవచ్చని తెలుస్తోం ది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్స్ గ్రూప్ అప్పులు గత ఏడాది సెప్టెంబరు నాటికి రూ.12,778 కోట్లకు చేరుకున్నాయి.