సీఎం రిలీఫ్ ఫండ్కు రిలయన్స్ ఇండస్ర్టీస్ రూ. 5 కోట్ల విరాళం
ABN , First Publish Date - 2020-04-11T01:39:40+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎంఆర్ఎఫ్)రూ. 5కోట్లను విరాళంగా అందజేసింది.
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి (సీఎంఆర్ఎఫ్)రూ. 5కోట్లను విరాళంగా అందజేసింది. ఈ మేరకు జియో తెలంగాణ సీఈవో కేసీరెడ్డి, ఆర్ఐఎల్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్టపల్లి శుక్రవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావును కలిసి ఐదుకోట్ల సీఎంఆర్ఎఫ్ లేఖను అందజేశారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధాన మంత్రి పిలుపు పై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతో పాటు పీఎం-కేర్స్ సహాయ నిధికి రిలయన్స్ ఇప్పటికే 530 కోట్లు అందించింది. కరోనా వైరస్ మహమ్మారి తీసుకు వచ్చిన సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడటానికి, గెలవడానికి దేశం సిద్ధం, ఆహారం, సరఫరాకు ఆర్ఐఎల్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుందన్నారు. రియలన్స్ ఇండస్ర్టీస్ , రిలయన్స్ ఫౌండేషన్ భారత దేశపు మొదటి 100 పడకల కోవిడ్-19 హాస్పిటల్తో సహా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు కేవలం రెండు వారాల్లోనే ఆస్పత్రిని సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత భోజనం అందిస్తోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా ప్రతి రోజూ దేశంలోని మిలియన్ల మందికి డోర్ డెలివరీ ద్వారా సామగ్రిని అందిస్తోంది.