ఖైదీ పెరోలుపై విడుదలై...మరో హత్య చేసి...

ABN , First Publish Date - 2020-10-22T21:14:16+05:30 IST

కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో పెరోల్ పై విడుదలైన ఓ ఖైదీ మరో హత్య చేసిన ఘటన...

ఖైదీ పెరోలుపై విడుదలై...మరో హత్య చేసి...

న్యూఢిల్లీ : కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో పెరోల్ పై విడుదలైన ఓ ఖైదీ మరో హత్య చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. హత్య కేసులో దోషి విశ్వజిత్ అలియాస్ చాచాకు జీవిత ఖైదు విధించడంతో అతను జైలులో ఉన్నాడు. కరోనా కారణంగా పెరోల్ పై ఖైదీ విశ్వజిత్ ను విడుదల చేశారు. పెరోల్ పై విడుదలైన విశ్వజిత్ గోవింద్ పురి పోలీసుస్టేషను పరిధిలో హత్యకు పాల్పడటంతో అతన్ని మళ్లీ అరెస్టు చేసి జైలుకు తరలించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. 


విశ్వజిత్ విక్కీతో కలిసి పేకాట ఆడాడు. విశ్వజిత్ పేకాటలో మోసం చేశాడని తన డబ్బును తిరిగి ఇవ్వాలని విక్వీ డిమాండు చేశాడు. దీంతో విశ్వజిత్ కత్తితో విక్కీని పొడిచి చంపాడు. పరారీలో ఉన్న విశ్వజిత్ గోవింద్ పురిలోని తన రహస్య స్థావరంలో పట్టుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.దర్యాప్తులో విశ్వజిత్ ఖైదీ అని పెరోల్ పై విడుదలై మరో హత్య చేశాడని తేలిందని పోలీసులు వివరించారు.

Updated Date - 2020-10-22T21:14:16+05:30 IST