బీడీ ఆకు సేకరణకు రూ.39.67 కోట్లు విడుదల
ABN , First Publish Date - 2020-10-24T09:26:13+05:30 IST
బీడీ ఆకు సేకరణకు రూ.39.67 కోట్లు విడుదల
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది రాష్ట్రంలో బీడీ ఆకు సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.39.67 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా ఈ ఆకు సేకరణను నిర్వహించనుంది. ఇందు కోసం ప్రభుత్వం ఈ కార్పొరేషన్కు రూ.39.67 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ ఏడాది సీజన్లో సుమారు 2,41,700 బ్యాగుల బీడీ ఆకులను సేకరించాలని భావిస్తోంది. రాష్ట్రంలో 37 డివిజన్లలో ఈ ఆకు సేకరణ ప్రక్రియ జరగనుంది.