ఏపీకి రెవెన్యూ గ్రాంట్ విడుదల
ABN , First Publish Date - 2022-02-05T03:11:32+05:30 IST
ఏపీకి రెవెన్యూ గ్రాంట్ను కేంద్రం విడుదల చేసింది. రెవిన్యూ
ఢిల్లీ: ఏపీకి రెవెన్యూ గ్రాంట్ను కేంద్రం విడుదల చేసింది. రెవిన్యూ లోటు కింద ఏపీకి రూ.1438.08 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 11వ విడత రెవెన్యూ గ్రాంట్ నిధులను కేంద్రం విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు నిధులను విడుదల చేసింది. 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు కింద రూ.9,871 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.