పంద్రాగస్టుకు ఖైదీల విడుదల లేనట్టే!
ABN , First Publish Date - 2020-08-13T07:42:19+05:30 IST
ఈ పంద్రాగస్టుకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల లేనట్టేనని తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఈ పంద్రాగస్టుకు సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల లేనట్టేనని తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ గత నెలలో అధికారులను ఆదేశించారు. అయితే క్షమాభిక్షపై విడుదల చేయాల్సిన ఖైదీల జాబితా ఇంకా పూర్తి కాలేదు. ఆగస్టు 15న క్షమాభిక్షపై విడుదల చేయాలనే కచ్చితమైన నిబంధన ఏమీ లేదని, ఎప్పుడైనా వారిని విడుదల చేసే అవకాశం ఉంటుందని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు.