కిడ్నాప్‌ కేసులో అనుమానితుడి ఫొటో విడుదల

ABN , First Publish Date - 2021-03-07T07:46:55+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి బాలుడు శివమ్‌కుమార్‌ సాహును కిడ్నాప్‌ చేశాడని భావిస్తున్న అనుమానితుడి ఫొటోను తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు శనివారం విడుదల చేశారు.

కిడ్నాప్‌ కేసులో అనుమానితుడి ఫొటో విడుదల
కిడ్నాపర్‌గా భావిస్తున్న అనుమానితుడి ఫొటో

గుర్తించినవారు 80999 99977 నెంబరుకు సమాచారమివ్వండి

తిరుపతి అర్బన్‌ ఎస్పీ విజ్ఞప్తి 


తిరుపతి(నేరవిభాగం), మార్చి 6: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి బాలుడు శివమ్‌కుమార్‌ సాహును కిడ్నాప్‌ చేశాడని భావిస్తున్న అనుమానితుడి ఫొటోను తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు శనివారం విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం గత నెల 27వ తేదీన తిరుపతికి వచ్చింది. స్థానిక అలిపిరి లింకు బస్టాండులో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చిన్నారి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి బాలుడి చేయిపట్టుకుని తీసుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. అప్పటినుంచి పోలీసులు కిడ్నాపర్‌ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు ఇరుగు పొరుగు జిల్లాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నాపర్‌గా భావిస్తున్న అనుమానితుడి ఫొటోను విడుదల చేశారు. ఈ వ్యక్తిని గుర్తించినవారు 80999 99977 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ వెంకట అప్పలయుడు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-07T07:46:55+05:30 IST