ఎంబీఏ రెండో సెమిస్టర్ ఫలితాల విడుదల
ABN , First Publish Date - 2021-10-20T07:44:55+05:30 IST
గతేడాది డిసెంబరులో నిర్వహించిన ఎస్వీయూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
దూరవిద్య ఎంబీఏ, సైకాలజీ డిప్లొమా ఫలితాలు కూడా
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), అక్టోబరు 19: గతేడాది డిసెంబరులో నిర్వహించిన ఎస్వీయూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. అలాగే, ఈ ఏడాది జూలైలో నిర్వహించిన దూరవిద్య గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ పీజీ డిప్లొమా, ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు కూడా విడుదల చేశారు. ఈ ఫలితాలను.. ‘మనబడి’ వెబ్ సైట్లో పొందుపర్చినట్టు ఎస్వీయూ పరీక్షల డీన్ ప్రొఫెసర్ సుబ్బారెడ్డి తెలిపారు.