కల్యాణలక్ష్మికి నిధుల విడుదల
ABN , First Publish Date - 2021-11-27T01:36:25+05:30 IST
రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకానికి రూ.462.50 కోట్ల
హైదరాబాద్: రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకానికి రూ.462.50 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే షాదీ ముబారక్ పథకానికి కూడా రూ.150 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పెన్షన్దారుల బకాయిలను 36 విడతల్లో తెలంగాణ ప్రభుత్వం చెల్లించనుంది. 2022 జనవరి నుంచి 36 నెలల పాటు బకాయిల చెల్లిస్తారు. పెరిగిన పెన్షన్, గ్రాట్యుటీ బకాయిలను కూడా చెల్లించనుంది. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు బకాయిలను ఏక మొత్తంగా ప్రభుత్వం అందించనుంది.