రెండు నామినేషన్ల తిరస్కరణ
ABN , First Publish Date - 2021-02-25T06:02:57+05:30 IST
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ పరిశీలించారు.
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 24: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్ పరిశీలించారు. అనంతరం సక్రమంగా లేని రెండు నామినేషన్లను బుధవారం తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీనుంచి నామినేషన్ వేసిన ముంద్ర మల్లికార్జున్రావు, దళిత బహుజన పార్టీ నుంచి నామినేషన్ వేసిన బత్తుల శ్రవన్కుమార్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో స్ర్కూట్నీ అనంతరం 74మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కాగా ఉపసంహరణకు రెండురోజులే గడువు ఉందని పీజే పాటిల్ తెలిపారు. ఆయనవెంట సహాయ రిటర్నింగ్ అధికారి వి.చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ఉన్నారు.