ఎంఎస్ఎంఈలకు జవసత్వాలు
ABN , First Publish Date - 2020-06-02T06:20:32+05:30 IST
ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి మండలి మరిన్ని చర్యలు తీసుకుంది. ముఖ్యం గా ఈ సంస్థలు తమ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమో దు చేసేందుకు రూ.50,000 కోట్ల ఈక్విటీ మూలధన సాయం చేయాలని నిర్ణయించినట్టు...
- రూ.50,000 కోట్ల ‘ఈక్విటీ’ సాయం
న్యూఢిల్లీ: ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి మండలి మరిన్ని చర్యలు తీసుకుంది. ముఖ్యం గా ఈ సంస్థలు తమ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమో దు చేసేందుకు రూ.50,000 కోట్ల ఈక్విటీ మూలధన సాయం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావ్డేకర్ చెప్పారు. రూ.10,000 కోట్లతో ప్రత్యే క ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రభు త్వం ఎంఎస్ఎంఈలకు ఈ సాయం చేస్తుంది. ఇందుకోసం ఒక మదర్ ఫండ్ ఏర్పాటు చేసి, దాని ద్వారా డాటర్ ఫండ్స్ పేరుతో ఏర్పాటు చేసే మరో మూడు ప్రత్యేక నిధుల ద్వారా ఎంఎ్సఎంఈలకు ఈ మూల ధన సాయం అందుతుంది.
రూ.20,000 కోట్ల సబార్డినేట్ రుణాలు: దీనికి తోడు ఆర్థిక కష్టాల్లో ఉన్న రెండు లక్షల ఎంఎ్సఎంఈలను ఆదుకునేందుకు రూ.20,000 కోట్ల సబార్డినేట్ రుణాలు అందించేందుకూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇంకా ఈ కంపెనీల టర్నోవర్ పరిమితినీ రూ.100 కోట్ల నుంచి రూ.250 కోట్లకు పెంచింది.