ప్రజలెవరూ ఓటీఎస్‌ కట్టొద్దు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-07T21:21:06+05:30 IST

ప్రజలెవరూ ఓటీఎస్‌ కట్టొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పం మండలం చందం గ్రామంలో నిర్వహించిన ఓ సభలో చంద్రబాబు

ప్రజలెవరూ ఓటీఎస్‌ కట్టొద్దు: చంద్రబాబు

చిత్తూరు: ప్రజలెవరూ ఓటీఎస్‌ కట్టొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పం మండలం చందం గ్రామంలో నిర్వహించిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదని, ఆ పేపర్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి పట్టాలను రిజిస్టేషన్ చేసి ఇస్తానని తెలిపారు. ఈ ప్రభుత్వానికి రంగులపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని తప్పబట్టారు. రైతాంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, వరి రైతులకు కనీస అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఎన్నికల్లో వేయి ఇచ్చి ఇప్పుడు లక్ష వసూలు చేస్తున్నారని, ప్రజలను అన్ని విధాలుగా దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2022-01-07T21:21:06+05:30 IST