ఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-09-28T00:53:36+05:30 IST
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 45 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 6,75,674కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 5,708 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 64,876 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 6,05,090 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 56 లక్షల 202 టెస్టుల నిర్వహించారు.
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మరణాలు... ప్రకాశం 8, కృష్ణా 6, గుంటూరు 5, తూర్పుగోదావరి, 4, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,006, పశ్చిమగోదావరి జిల్లాలో 929, ప్రకాశం 659 కరోనా కేసులు నమోదయ్యాయి.