ఈ-రక్షాబంధన్లో నమోదుకండి : ఎస్పీ కృష్ణారావు
ABN , First Publish Date - 2020-08-03T09:44:53+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనున్న ఈ-రక్షాబంధన్లో నమోదు కావాలని జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఆదివారం ఒక ..
విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనున్న ఈ-రక్షాబంధన్లో నమోదు కావాలని జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఏపీ పోలీస్-సీఐడీ, సైబర్పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ-రక్షాబంధన్ను ప్రారంభించనుందని వివరించారు. సైబర్ నేరాలపై బాలబాలికలు, మహిళలకు అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. ఇందుకోసం జిల్లాలోని కళాశాల విద్యార్థులు, మహిళలు స్మార్ట్ఫోన్ల ద్వారా యాప్డౌన్లోడ్ చేసుకుని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వివరాలను ఇతరులకు తెలియజేసి వారిని కూడా చేర్పించాలని పేర్కొన్నారు. ఈ నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని, మరింత సమాచారం కోసం 90716 66667 నంబరులో సంప్రదించాలని కోరారు.