వేరుశనగ విత్తనకాయలకు రిజిస్ర్టేషన చేసుకోండి : ఏఓ

ABN , First Publish Date - 2021-05-09T06:28:11+05:30 IST

వచ్చే ఖరీఫ్‌ సీజన సాగు కోసం రైతులకు అందించే వేరుశనగ విత్తన కాయల కోసం ఈ నెల 10వ తేదీ నుంచి రిజిస్ర్టేషన చేసుకోవాలని ఏఓ శ్యా మసుందర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వేరుశనగ విత్తనకాయలకు రిజిస్ర్టేషన చేసుకోండి : ఏఓ

బుక్కరాయసముద్రం, మే8 : వచ్చే ఖరీఫ్‌ సీజన సాగు కోసం రైతులకు అందించే వేరుశనగ విత్తన కాయల కోసం ఈ నెల 10వ తేదీ నుంచి రిజిస్ర్టేషన చేసుకోవాలని ఏఓ శ్యా మసుందర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మం డలంలోని 14 రైతు భరోసా కేంద్రాల్లో మూడు విడతలుగా వి త్తన పంపిణీ ఉంటుందన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి అగ్రహారం, చెన్నంపల్లి, బొమ్మలాటపల్లి, దయ్యాలకుంటపల్లి రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు రిజిస్ర్టేషన చేస్తామన్నారు. అదే విధంగా 17 నుంచి బుక్కరాయము ద్రం, సిద్దరాంపురం, దండువారిపల్లి, రెడ్డిపల్లి, రేకులకుంట, మూడో విడతగా 24 నుంచి బోడిగానిదొడ్డి, కొర్రపాడు, చెదుళ్ల, గోవిందంపల్లి, వడి యంపేట గ్రామంలో రైతులకు రిజిస్ర్టేషన చేస్తామన్నారు. ఇప్పటికే మండలానికి 2100 క్వింటాళ్ల వేరుశనగ విత్తనకా యలు వ్యవసాయశాఖ గోదాములు, వివిధ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ చేశామన్నారు. సబ్సిడీ విత్తన వేరుశనగ పూర్తి ధర క్వింటాలు రూ. 8680కాగా.. సబ్సిడీ 40 శాతం అనగా రూ. 3472 పోగా రైతులు తమవాటా కింద క్వింటాలు రూ. 5208 ప్రకారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. 


Updated Date - 2021-05-09T06:28:11+05:30 IST