రీజనల్ సైన్స్ సెంటర్ కో-ఆర్డినేటర్ మృతి
ABN , First Publish Date - 2021-04-11T07:11:22+05:30 IST
తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఆర్.మణిగండన్ కొవిడ్తో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.
తిరుపతి(విద్య), ఏప్రిల్ 10: తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్ కో-ఆర్డినేటర్ ఆర్.మణిగండన్ కొవిడ్తో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. వారం రోజుల క్రితం ఆయనకు పాజిటివ్ లక్షణాలు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం ఆర్ఎస్సీ వెబ్సైట్లో అధికారికంగా పొందుపరిచారు. కాగా.. ఆయన మృతదేహానికి శనివారం స్థానిక గోవిందధామంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం.