రూపాకుల కుటుంబీకులకు సత్కారం

ABN , First Publish Date - 2022-08-15T05:33:44+05:30 IST

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు దేశభక్తిని అలవరచుకోవాలని ఆర్‌డివో హుస్సేన్‌ సాహెబ్‌ అన్నారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే కార్యక్రమం నిర్వహించారు.

రూపాకుల కుటుంబీకులకు సత్కారం
రూపాకుల కుటుంబ సభ్యులను సన్మానిస్తున్న అధికారులు

మహారాణిపేట, ఆగస్టు 14: పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు దేశభక్తిని అలవరచుకోవాలని ఆర్‌డివో హుస్సేన్‌ సాహెబ్‌ అన్నారు. ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే కార్యక్రమం నిర్వహించారు. మహారాణిపేటలో స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, విశాలక్ష్మి దంపతుల కుమారుడు రూపాకుల రవికుమార్‌, కుమార్తె లక్ష్మిలను ఆర్‌డీవో హుస్సేన్‌, పౌర సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మణిరామ్‌లు  శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూపాకుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-15T05:33:44+05:30 IST