5 కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్సులో ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2021-01-16T05:26:44+05:30 IST
విద్యుత్ చార్జీల నియంత్రణపై (2021-22) 5 కేంద్రాల్లో ప్రజాభిప్రేయ సేకరణ జరపనున్నట్లు సందరన్ సర్కిల్ ఎస్ఈ డీవీ చలపతి, ఈఈ ఎం.కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు.
తిరుపతి(ఆటోనగర్), జనవరి 15: విద్యుత్ చార్జీల నియంత్రణపై (2021-22) 5 కేంద్రాల్లో ప్రజాభిప్రేయ సేకరణ జరపనున్నట్లు సందరన్ సర్కిల్ ఎస్ఈ డీవీ చలపతి, ఈఈ ఎం.కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సీఎండీ హరనాథరావు ఆదేశాల మేరకు.. పీలేరు, మదనపల్లె, పుత్తూరు, చిత్తూరు (రెండు డివిజన్లకు చిత్తూరురూరల్ డివిజన్ కార్యాలయంలో), తిరుపతి (టౌన్, రూరల్ డివిజన్లకు ఎస్ఈ కార్యాలయంలో) నిర్వహిస్తామన్నారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామన్నారు. ఇందులో పాల్గొనే ప్రజాసంఘాలు నాయకులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులు తమ పేర్లను డివిజన్ కార్యాలయ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.