తాగు, సాగు నీటి ఎద్దడి రానీయవద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-04-05T10:58:00+05:30 IST

జిల్లాలో ఎక్కడా సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశించారు.

తాగు, సాగు నీటి ఎద్దడి రానీయవద్దు : కలెక్టర్‌

ఏలూరు ఏప్రిల్‌ 4, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో ఎక్కడా సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశించారు. జడ్పీ సీఈవో, ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులతో కలెక్టర్‌ ముత్యాలరాజు సమీక్షించారు.


కలెక్టర్‌ మాట్లా డుతూ మూడేళ్లుగా జిల్లాలో ఎక్కడెకక్కడ సాగు, తాగునీటి సమస్యలు ఎదుర వుతున్నాయో గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  సాగునీరు అందక పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లితే అందుకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చ రించారు.  సమావేశంలో జడ్పీ సీఈవో పి.శ్రీనివాసులు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఎంఆర్‌ రమేశ్‌ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ జేవీ రాఘవులు పాల్గొన్నారు. 


జిల్లాలో రెడ్‌జోన్‌ ప్రకటించిన ప్రాంతాలలో కార్డుదారులకు వలంటీర్ల ద్వారానే రేషన్‌ సరుకులు ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు  జేసీ కె.వెంకట రమణారెడ్డి చెప్పారు.  సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీ ల్దార్లతో జేసీ రేషన్‌ సరుకుల పంపిణీపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. 

Updated Date - 2020-04-05T10:58:00+05:30 IST