ఫీజులు తగ్గించడంపై హర్షం

ABN , First Publish Date - 2020-06-01T10:06:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం 43 జీవోను ఇంప్లిమెంట్‌ చేయడంతో పాటు వైద్యకళాశాలల ఫీజులను తగ్గించడం

ఫీజులు తగ్గించడంపై హర్షం

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 31: రాష్ట్ర ప్రభుత్వం 43 జీవోను ఇంప్లిమెంట్‌ చేయడంతో పాటు వైద్యకళాశాలల ఫీజులను తగ్గించడం హర్షణీయమని రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.నాగేశ్వరరావు యా దవ్‌, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఒక ప్రకటనలో అన్నారు. ఆదివారం వారు విడుదల చేసిన ఒక ప్రకటనలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.  43 జీవోను ప్రభుత్వం ఇంప్లిమెంట్‌ చేయడంతో పాటు ప్రైవేటు వైద్యకళాశాలల ఫీజులను తగ్గించడం ద్వారా పేద, మద్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు, వైద్య విద్యను చదివేందుకు ఆస్కారం ఏర్పడిందని అన్నారు.  

Updated Date - 2020-06-01T10:06:45+05:30 IST