పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలి
ABN , First Publish Date - 2022-05-17T06:27:18+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన డిమాండ్ చేశారు.
సూర్యాపేట కల్చరల్, మే 16 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పొట్టిశ్రీరాములు సెంటర్లో గ్యాస్ సిలిండర్లతో సోమవారం నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ధరలు పెం చుతూ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు అనంతుల మల్లీశ్వరీ, ఉప్పల కోటమ్మ, దేవర మల్లీశ్వరీ, లక్ష్మి, రేఖ, వెంకటమ్మ, జయసుధ, అలివేలు, అంజమ్మ పాల్గొన్నారు.