పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించండి
ABN , First Publish Date - 2021-07-25T05:41:45+05:30 IST
రోజు రోజుకు పెరిగిపోతున్న డీజల్, పెట్రోల్ ధరలు నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని సోషలిస్ట్ యూనిటీ సెంటర్, ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
హిందూపురం టౌన, జూలై 24: రోజు రోజుకు పెరిగిపోతున్న డీజల్, పెట్రోల్ ధరలు నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని సోషలిస్ట్ యూనిటీ సెంటర్, ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పెంచిన ధరలు తగ్గించాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్యుసిఐ నాయకులు మాట్లాడుతూ పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడంతో నిత్యవసర ధరలు అమాంతంగా పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్యుసిఐ నాయకులు రామక్రిష్ణారెడ్డి, మల్లిక్దత, సుమలత, మంజునాథ్, ప్రసూన, నిహార్, తదితరులు పాల్గొన్నారు.