వాయు కాలుష్యం తగ్గించాలి: జేసీ
ABN , First Publish Date - 2021-07-27T05:23:13+05:30 IST
వచ్చే రెండేళ్లలో వాయు కాలుష్యం 20 శాతం తగ్గించే దిశగా సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలని జేసీ మహేష్కుమార్ ఆదేశించారు.
కలెక్టరేట్: వచ్చే రెండేళ్లలో వాయు కాలుష్యం 20 శాతం తగ్గించే దిశగా సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేయాలని జేసీ మహేష్కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో ఆయా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వాయు కాలుష్యం క్యూబిక్ మీటర్ కు 59 మైక్రో గ్రాములు ఉన్నందున దీనిని 20 శాతం వరకు తగ్గించాల న్నారు. దేశంలో 122 పట్టణాల్లో కాలుష్యం తగ్గించాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశించిందని చెప్పారు. రాష్ట్రంలోని 13 నగరాలు ఎంపిక చేయగా, వాటిలో విజ యనగరం కూడా ఉందని చెప్పారు. విజయనగరంలో 2017 నాటికి వాయు కాలుష్యం క్యూబిక్ మీటరుకు 63 మైక్రో గ్రాములు ఉండగా, 2020 నాటికి 59 మైక్రో గ్రాములకు తగ్గిందన్నారు. ఇంకా వాయు కాలుష్యం గణనీ యంగా తగ్గాలంటే , పెట్రోల్కు బదులుగా బ్యాటరీపై నడిచే వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. సమావేశంలో చెన్నై నుంచి వచ్చిన సీపీసీబీ శాస్త్రవేత్త టి.మహిమ తదితరులు ఉన్నారు.