వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా.. అయితే మీకోసమే ఈ ల్యాప్టాప్స్
ABN , First Publish Date - 2021-08-03T21:16:11+05:30 IST
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ రెండు అద్భుతమైన ల్యాప్టాప్లను ఈ రోజు(మంగళవారం) లాంచ్ చేసింది. రెడ్మిబుక్ ప్రొ..
న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ రెండు అద్భుతమైన ల్యాప్టాప్లను ఈ రోజు(మంగళవారం) ఇండియాలో లాంచ్ చేసింది. రెడ్మిబుక్ ప్రొ, రెడ్మిబుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ పేరుతో తీసుకొచ్చిన ఈ రెండింటిలోనూ 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఉపయోగించారు. 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజీ ఉంది. ప్రొఫెషనల్స్, వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారిని ఉద్దేశించి రెడ్మిబుక్ ప్రొను తీసుకురాగా, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం రెడ్మి బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ను డిజైన్ చేసింది.
ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగిన ఈ ల్యాప్టాప్స్ సింగిల్ చార్జింగ్తో పది గంటలపాటు పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. విండోస్ 10 హోమ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ ఎడిషన్ 2019లను ముందస్తుగానే లోడ్ చేసింది. ఈ రెండు ల్యాప్టాప్లు విండోస్ 11కు ఉచితంగా అప్గ్రేడ్ అవుతాయి. అలాగే, కంపాటిబుల్ డివైజ్ల మధ్య ఫైల్స్ను సులభంగా షేర్ చేసుకునేందుకు ఎంఐ స్మార్ట్ షేర్ యాప్ను కూడా వీటిలో ఇన్స్టాల్ చేసింది.
ధరలు ఇలా..
రెడ్మిబుక్ ప్రొ 8జీబీ ర్యామ్+512 జీబీ స్టోరేజీ కన్ఫిగరేషన్ ధర రూ. 49,999 మాత్రమే. రెడ్మిబుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ 8జీబీ+256 జీబీ వేరియంట ధర రూ. 41,999 కాగా, 8జీబీ ర్యామ్+512 జీబీ ఆప్షన్ ధర రూ. 44,999 మాత్రమే. ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంఐ.కామ్, మై హోం స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.