కొత్త మోడల్లో 8GB RAMతో Redmi ల్యాప్టాప్..
ABN , First Publish Date - 2021-07-31T02:48:57+05:30 IST
కొత్త మోడల్లో 8GB RAMతో Redmi ల్యాప్టాప్..
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ రెడ్మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్లో రెడ్మిబుక్ 15 ల్యాప్టాప్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే రెడ్మిబుక్ 15 ల్యాప్టాప్ విడుదలకు ముందే కొన్ని ఫీచర్స్ లీకయ్యాయి. 512జీబీ స్టోరేజ్, 14- అంగుళాలు, 8జీబీ ర్యామ్తోపాటు రెండు రంగుల్లో రెడ్మిబుక్ 15 ల్యాప్టాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత మార్కెట్లో రెడ్మిబుక్ 15 ల్యాప్టాప్ ప్రారంభ ధర రూ. 50,000 ఉంటుందని స్పష్టమవుతోంది.