వీధులకు రీడిజైన్‌..!

ABN , First Publish Date - 2020-11-28T06:16:05+05:30 IST

పిల్లలు ఆడుకోవడానికి పార్కు, వాకింగ్‌కు ప్రత్యేక ట్రాక్‌, ఎటు చూసినా పచ్చదనం పరిఢవిల్లాలి. ప్రజాసౌకర్యాలైన మార్కెట్‌, వాణిజ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి.

వీధులకు  రీడిజైన్‌..!

వీధులకు  రీడిజైన్‌..!

శివాలయం వీధి, వాంబే కాలనీ ఎంపిక  

డిజైన్ల సమర్పణకు 15 రోజుల గడువు

చిట్టినగర్‌, నవంబరు 27: పిల్లలు ఆడుకోవడానికి పార్కు, వాకింగ్‌కు ప్రత్యేక ట్రాక్‌, ఎటు చూసినా పచ్చదనం పరిఢవిల్లాలి. ప్రజాసౌకర్యాలైన మార్కెట్‌, వాణిజ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించాలి. దీనికి తగినట్టుగానే నగరంలో వీధులను మార్పు చేయాలని భావిస్తోంది విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌. దీనికి సంబంధించి వీధుల రీడిజైన్‌కు కాంపిటేషన్‌ నిర్వహిస్తోంది. ఈ పోటీలకు విజయవాడ సత్యనారా యణపురం ప్రధాన రహదారితోపాటు శివాలయం వీధి, అజిత్‌సింగ్‌ నగర్‌లోని వాంబే కాలనీలను ఎంపిక చేసింది. ఆర్కిటెక్చర్లు, కన్సల్టెంట్లు, బిల్డర్స్‌ అసోసి యేషన్‌తోపాటు కాలనీ సంఘాల నుంచి నమూనాలను ఆహ్వానించి, పోటీ నిర్వహి స్తోంది. శనివారం నుంచి 15 రోజుల్లోగా ఈ నమూనాలను వీఎంసీకి అందజేయాలి. వీఎంసీకి సంబంధించిన సోషల్‌ మీడియా వాట్సాప్‌ నంబర్‌, ఈ మెయిల్‌కు వాటిని పంపాలి. వచ్చిన ఎంట్రీల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి, వాటికి తగిన పారితోషికాన్ని వీఎంసీ అందజేస్తుంది. 

Updated Date - 2020-11-28T06:16:05+05:30 IST