విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-09-17T06:27:25+05:30 IST
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ
చందుర్తి, సెప్టెంబరు 16: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలో గురువారం ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ శుక్రవారం నిర్మల్లో జరిగే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హాజరుకానున్నరన్నా రు. అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయలన్నారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేష్, నాయకు లు మార్త సత్తయ్య, సిరికొండ శ్రీనివాస్, చిలుక పెం టయ్య, రేగుల మల్లికార్జున్, గంగారాజు, విజేందర్, చారి, గంగాధర్, బాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు.