కాళ్లు పట్టుకుంటా రెడ్డీ..!

ABN , First Publish Date - 2022-08-06T08:23:55+05:30 IST

కాళ్లు పట్టుకుంటా రెడ్డీ..!

కాళ్లు పట్టుకుంటా రెడ్డీ..!

నా స్థలం కబ్జా చేశారు... ఇప్పించండి 

ఆదోని ఎమ్మెల్యే ఎదుట మహిళ ఆవేదన 


ఆదోని(అగ్రికల్చర్‌), ఆగస్టు 5: ‘మా అత్త కూలి పనిచేసి 275 సెంట్ల స్థలం కొంటే ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారు. కాళ్లు మొక్కుతా రెడ్డి... కబ్జా నుంచి స్థలం ఇడిపించండి’ అని ఆదోని వైసీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ముందు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్‌లో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. భాగ్యమ్మ అనే మహిళ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లగా.. కష్టపడి సంపాదించుకున్న స్థలాన్ని కబ్జా చేశారని, ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గట్టిగా మాట్లాడితే అధికారం తమదేనని చెబుతున్నారని, న్యాయం చేయాలని కోరింది. ఎరుకల నగేష్‌, కృష్ణ అనే వ్యక్తులు కబ్జా చేశారని చెప్పడంతో ఆమె స్థలాన్ని ఆమెకే చెందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక తన భర్త ఆటో ప్రమాదంలో రెండేళ్ల కిందట చనిపోయారని, ఇప్పటివరకు పింఛన్‌ ఇవ్వ లేదని నాగమ్మ అనే మహిళ కన్నీరు మున్నీరైంది. పింఛన్‌ కోసం సచివాలయం చుట్టూ తిప్పకుంటున్నారని వాపోయింది.

Updated Date - 2022-08-06T08:23:55+05:30 IST