జగన్‌ ప్రభుత్వంలో రైతులకు మేలు కలే..!

ABN , First Publish Date - 2020-10-02T09:08:51+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకు చేసే మేలు కలగానే మిగిలిందని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు.

జగన్‌ ప్రభుత్వంలో రైతులకు మేలు కలే..!

కొత్తపేట, అక్టోబరు 1: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతులకు చేసే మేలు కలగానే మిగిలిందని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి విమర్శించారు. గురువారం కొత్తపేటలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం పేరిట కోట్లాది రూపాయల లెక్కలు చూపించి మోసం చేస్తున్నారన్నారు.


రైతులకు ఎటువంటి సబ్సిడీలు లేవని, గిట్టుబాటు ధర కల్పించలేకపోయారన్నారు. కరోనా సమయంలో రైతులు పండించే పంటలకు అటు ప్రభుత్వం గిట్టుబాటు లేక, అయినకాడికి దళారులకు అమ్ముకుని నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. పెట్టిన పెట్టుబడులు రాక రైతుల ఆత్మహత్యలు దాపురిస్తున్నాయని, రైతుల కంట కన్నీరు కారిస్తే రాష్ట్రానికి మంచిది కాదని, రైతుసంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడాలని ఆమె సూచించారు. 

Updated Date - 2020-10-02T09:08:51+05:30 IST