రెడ్క్రాస్ 100 ఏళ్ల సైకిల్ యాత్ర
ABN , First Publish Date - 2021-03-04T05:14:35+05:30 IST
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు రెడ్క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
రక్తదానం, కాలుష్యంపై ప్రచారం
రెడ్క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి
నెల్లూరు (వైద్యం), మార్చి 3 : ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు రెడ్క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రెడ్క్రాస్ భవనంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీన సైకిల్ యాత్ర ప్రారంభమై అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా ఈ నెల 25వ తేదీకి విజయవాడకు చేరుతుందన్నారు. ఈ యాత్రలో రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించటంతోపాటు గాలి కాలుష్యం, మొక్కల పెంపకంపై యువతలో చైతన్యం తీసుకువస్తామన్నారు. అనంతరం సైకిల్ యాత్ర బ్రోచర్ను విడుదల చేశారు. యాత్రలో పాల్గొనదలచిన వారు వంశీకృష్ణ 8309966242 నెంబర్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ కమిటీ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు, కమిటీ సభ్యులు రవిప్రకాష్, గునపాటి ప్రసాద్రెడ్డి, బయ్యా ప్రసాద్, దాసరి రాజేంద్ర ప్రసాద్, గంధం ప్రసన్నాంజనేయులు, యడవల్లి సురేష్, వెంకటేష్ పాల్గొన్నారు.