పేద మహిళకు రెడ్క్రాస్ సభ్యుల అండ
ABN , First Publish Date - 2022-06-23T04:16:46+05:30 IST
తుపానుతో ఇల్లు కోల్పోయిన నిరుపేద మహిళ గుంజి కనకమ్మకు రెడ్క్రాస్ జీవితకాల సభ్యులు అండగా నిలిశారు.
ఇల్లు నిర్మించి అప్పగింత
కావలిటౌన్, జూన్ 22: తుపానుతో ఇల్లు కోల్పోయిన నిరుపేద మహిళ గుంజి కనకమ్మకు రెడ్క్రాస్ జీవితకాల సభ్యులు అండగా నిలిశారు. ఓ ఇల్లు నిర్మించి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని తుఫాన్నగర్లో నివాసం ఉండే కనకమ్మ ప్రకృతి వైపరీత్యాలతో ఇల్లు కోల్పోయింది. ఇది తెలుసుకున్న రెడ్క్రాస్ జీవితకాల సభ్యురాలు, మాజీ కౌన్సిలర్ నందనవనం సీతాలక్ష్మి తన సహచర సభ్యులతో చర్చించి చందాలు వేసుకుని సుమారు రూ.1.6 లక్షలతో ఓ రేకుల ఇల్లు నిర్మించారు. దీనిని బుధవారం ఆర్డీవో శీనానాయక్తో ప్రారంభించి, కనకమ్మతో గృహప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు దామిశెట్టి సుధీర్బాబు,తదితరులు పాల్గొన్నారు.