రెడ్ వలంటీర్ల సేవలు యువతకు ఆదర్శం
ABN , First Publish Date - 2022-05-16T06:48:39+05:30 IST
రెడ్ వలంటీర్ల సేవలు యువతకు ఆదర్శం
గన్నవరం, మే 15 : పుచ్చలపల్లి సుందరయ్య రెడ్ వలంటీర్ల సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ బడుగు బాలమ్మ అన్నారు. మండలంలోని బుద్ధవరం బీసీ కాలనీలో రోడ్డు ఇరువైపుల ఉన్న కంచె, పిచ్చి మొక్కలను రెడ్ వలంటీర్స్ ఆధ్వర్యంలో ఆదివారం తొలగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాలమ్మ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో పుచ్చలపల్లి సుందరయ్య అంటే తెలియని వారు ఉండరన్నారు. అటువంటి మహనీయుని పేరుతో ఏర్పాటు చేసిన రెడ్ వలంటీర్ల కమిటీ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి శ్రమధానం చేయటం గొప్పవిషయమన్నారు. గ్రామాల్లో యువకులు చదువు, ఉపాధి మార్గాల వైపు కాకుండా సామాజిక సేవలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నెల రోజులపాటు గ్రామంలో సేవలందించి ప్రజలకు చేరువైన రెడ్ వలంటీర్లను అభినందించారు. దళ నాయకుడు మోటమర్రి నాగబ్రహ్మచారి, బడుగు మరియదాసు, మల్లంపల్లి ఆంజనేయులు, సూరగాని సాంబశివరావు, మిరప నాగేశ్వరరావు, కళ్ళం కోటయ్య, నాగరాజు, సీతారామారాజు పాల్గొన్నారు.