నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-29T05:10:38+05:30 IST
విజన్ పరిధి సీసీ గుంట బీటులోని పెద్ద ఏపిలి బండ వద్ద నాలుగు ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసి నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వైవీ నరసింహారావు తెలిపారు.
రాజంపేట టౌన్, మే28: డివిజన్ పరిధి సీసీ గుంట బీటులోని పెద్ద ఏపిలి బండ వద్ద నాలుగు ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేసి నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వైవీ నరసింహారావు తెలిపారు. వీటి విలువ రూ. 30వేల వరకు ఉం టుందని తెలిపారు. పట్టుబడ్డ వారిలో గడికోట మండలం ఎదపల్లె వాసులు నాగరాజు, ఎ.రవీంద్ర, రామాపురం మండలం బీదవాండ్లపల్లెకు చెందిన బి.రఘునాధ్, ఎం. రామాంజనేయులును అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లావణ్య, సిబ్బంది పీరయ్య, సుబ్బరాయుడు పాల్గొన్నట్లు తెలిపారు.